
ఘనంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం
గోనెగండ్ల, న్యూస్ వెలుగు: విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని గోనెగండ్ల లో ఏపీ మోడల్ స్కూల్ లో విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహిoచారు. . ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జయ నాగేశ్వర్రెడ్డి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోడల్ స్కూల్లో స్కూల్ మొత్తాన్ని పరిశీలించి ఇక్కడ జరుగుతున్న బోధన మరియు వారికి కావలసిన అందుతున్న సౌకర్యాలని గురించి అడిగి తెలుసుకోవడం జరిగిం
ది ఈ కార్యక్రమాన్ని జ్యోతి జ్యోతి నీ వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు విద్య బోధన గురించి తెలుసుకోవడం ఈ కార్యక్రమం లో గురువుల యొక్క పాత్ర విద్యార్థుల జీవితంలో ముఖ్యమైనదిగా పేర్కొనడమైనది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమైనదని చెప్పడం జరిగింది స్కూళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలను నా పరిధిలో ఉన్న వాటిని తక్షణం అన్ని కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది గోనెగండ్ల MEO రామాంజనేయులు గారు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను మొదలైన విషయాలను వివరించడమైనది ప్రభుత్వము మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం జరిగిందిగోనెగండ్ల మండలం మొత్తం విద్యార్థుల సంఖ్య మరియు ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో మరియు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న వారి యొక్క సంఖ్యను తెలియజేయడమైనది . గోనెగండ్ల మండలంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10641. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 1485. గోనెగండ్ల మండలం మొత్తం విద్యార్థుల సంఖ్య 12,121 . ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య 325. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత సుమారుగా 80 మంది ఉపాధ్యాయులు కొరత ఉంది గోనెగండ్లలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ఇంకొకటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది గోనెగండ్లలో ప్రస్తుతం ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఏపీ మోడల్ స్కూల్ , కస్తూరిబా స్కూల్ ఇక్కడ ఉండడం జరిగింది గోనెగండ్ల లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో ఇంకొక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు అధికారులు మండల స్థాయి నాయకులు నజీర్ సాహెబ్, తిరుపతయ్య ,కౌలుట్లయ్య, గాజులదిన్నె హనుమంతు, గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని, అడ్వకేట్ లు పోలకలు వెంకటేశ్వర్లు, పూజారి చంద్రశేఖర్, కొత్తింటి పక్రుద్దీన్ రామాంజనేయులు, బేతల బడేసా, రంగస్వామినాయుడు, మొదలైన నాయకులు పాల్గొన్నారు.