ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్ధ లో ఉద్యోగ మేళా

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్ధ లో ఉద్యోగ మేళా

తిరుపతి, న్యూస్ వెలుగు; ఐ.టి.ఐ.పాస్, అప్రెంటిస్ పాస్ అయిన విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, చిత్తూరు నందు తేది. 22-01-2025న క్యాంపస్ రిక్యూప్మెంటు నిర్వహించబడును. ఇందులో అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెన్సీ, తిరుపతి వారు పాల్గొనెదరు. జీతం నెలకు రు.21000/- తో పాటు బస్సు సౌకర్యం, బోజనం, వసతి మరియు పియఫ్, గ్రాట్యుటీ చెల్లించెదరు. కావున ఆసక్తి గల అభ్యర్ధులు తేది.22-01-2025న ఉదయం 10-00 గంటలకు తమ సర్టిఫికెట్స్ (యస్.యస్.సి., ఐ.టి.ఐ, అప్రెంటిస్, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు మరియు ఇతర సర్టిఫికెట్స్)తో హజరు కావలెను. మరిన్ని వివరములకు శ్రీమతి వి. శ్రీలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్ధ, తిరుపతి వారిని లేక అప్రెంటిస్ సలహాదార్లు (సెల్ నెం.9550722922, 9441647174) వారిని సంప్రదించవలెను.

ప్రధానాధికారి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్ధ తిరుపతి

Author

Was this helpful?

Thanks for your feedback!