
జగన్ పాలనలోనే పేదలకు న్యాయం ; సుభాష్ చంద్రబోస్
న్యూస్ వెలుగు, కర్నూలు; మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. కర్నూలు గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బిర్లాగేటు వద్ద కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈసందర్భంగా కార్మికులను సుభాష్ చంద్రబోస్ సన్మానించారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో కార్మికులు, కూలీలు ఆనందంగా జీవించారన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!