ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా కే. సురేష్ కుమార్

ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా కే. సురేష్ కుమార్

న్యూస్ వెలుగు, కర్నూలు; కాకినాడలో జరిగిన యుటిఎఫ్ రాష్ట్ర 17వ విద్యా వైజ్ఞానిక మహాసభల్లో కర్నూలు జిల్లాకు చెందిన యుటిఎఫ్ సీనియర్ నాయకులు కే సురేష్ కుమార్ ఐక్య ఉపాధ్యాయపత్రిక ప్రధాన సంపాదకులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రభాకర వర్మ ప్రకటించినట్లు జిల్లా నాయకులు తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగానూ , ఐక్య ఉపాధ్యాయ పత్రిక చీఫ్ ఎడిటర్ గాను కే సురేష్ కుమార్ కొనసాగన్నారు. అలాగే యూటిఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతల్లో ఉన్న యుఆర్ఏ రవికుమార్ ను యూటీఎఫ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ లో జిల్లా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల హర్షం ప్రకటిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటీ ఉపాధ్యక్షులు జి. హేమంత్ కుమార్, సీనియర్ నాయకులు ఎస్ఎం జయరాజు, యెహోషువాలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!