
ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కన్నడ కార్యక్రమం
ఆకట్టుకున్న సిరిగేరి ధాత్రి సంస్థ నాటక
హోలగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం శ్రీగూల్యం హిరేమఠ్ కుమారస్వామి కన్నడ సేవాసమితి,ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శాలేగోందు కన్నడ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం శ్రీధరగడ్డే సిద్దబసప్ప జీవిత చైతన్య పై ఉపన్యాస కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ,కన్నడ లెక్చరర్ సి.ఎం.చన్నబసయ్య మాట్లాడుతూ పాఠశాలలకు, కళాశాలలకు,వికలాంగులకు, సామూహిక వివాహాలకు సుమారు 36 లక్షల రూపాయల విరాళంగా అందించిన ఘనత శ్రీధరగడ్డే సిద్ధ బసప్పకే దక్కుతుందన్నారు.అంతేకాకుండా శ్రీధరగడ్డే సిద్ధ బసప్ప కన్నడను ప్రేమించే పుణ్యాత్ముడని మరియు ఆయన అందించిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దబసప్ప ధర్మపత్ని శకుంతలమ్మ,కన్నడ సంఘం అధ్యక్షుడు శివశంకరగౌడ్,విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కె.గాదిలింగప్ప తదితరులు హాజరయ్యారు.అనంతరం ధాత్రి నాటక సంస్థ (రి) వారిచే సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు.