సందడిగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

సందడిగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

ఆకట్టుకున్న కార్తీక దీపోత్సవం.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్నీ ప్రారంభించిన ష||బ్ర|| అజాత శంభులింగ శివాచార్యులు.
కార్తీక దీప కాంతులతో మెరిసి ఆలయ ప్రాంగణం.
హోళగుంద, న్యూస్ వెలుగు: కార్తీక మాసం హరిహారులకు అత్యంత ప్రీతికరం కావడంతో కార్తీక సోమవారాని పురస్కరించుకుని మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.ప్రధానంగా హొళగుంద ప్రజల ఆరాధ్యదైవం కొండ గుహలో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ్,శివశంకర్ గౌడ్,శ్రీ సిద్దేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ష||బ్ర|| అజాత శంభులింగ శివాచార్యులు హాజరయ్యారు.ముందుగా శ్రీ సిద్దేశ్వర స్వామిని దర్శించుకున్నారు.అనంతరం శివాచార్యులు అమృత హస్తలతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక దీపోత్సవ కార్యక్రమాని ప్రారంభించారు.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో ఉదయం నుంచి స్వామివారికి,రుద్రాభిషేకం,జలాభిషేకం, పంచామృతాభిషేకం, బిల్వార్చన,ఆకుపూజ, కుంకుమార్చన,మహా మంగళ హారతి,దేవునికి పెద్ద ఎత్తున పూలమాలతో అలంకరించారు.ఓం కారం,శివలింగాకృతి,త్రిశూలం,స్వస్తిక్,శ్రీ కారం వంటి వివిధ అకృతులలో చేసిన దీపాలంకరణలు అందరిని ఆకట్టుకున్నాయి.సాయంత్రం చిన్నారులు, యువతి,యువకులు కలిసి కట్టుగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.అలాగే దేవాలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు సిద్దయ్య స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!