
18న కార్తీక దీపోత్సవం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఈ నెల 18న శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వంశపారంపర్య ఆలయ ధర్మకర్త రాజాపంపన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో జంగమర హొసల్లి అజాత శంభులింగ శివాచార్య మహా స్వాముల అమృత హస్తలతో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.కావున భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda