
జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం అని మహిళా న్యాయవాదులు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూల్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.ఈ సందర్భంగా న్యాయవాదులు లక్ష్మీ, మేరీ,సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ….జిల్లా ప్రజలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాటు ఆత్మాభిమానం కలిగి ఉంటారన్నారు. మహిళలు సర్వశక్తివంతులని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగంలో వున్నా,వ్యాపార, రాజకీయ ఇతర రంగాలలో స్థిరపడాలన్నా.ఆయా రంగాలలో ఉత్తమ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నిర్దేశించిన ఏ చిన్న పనైనా ప్రణాళిక బద్ధంగా నిర్వహించి 100 శాతం విజయం సాధించగలిగే సత్తా వారిలో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉమాదేవి,జయలక్ష్మి, ఇందుమతి,వనజ,ప్రమీల తదితరులు పాల్గొన్నారు.