
కర్నూలు నగర కుర్ని (నేసె) సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
న్యూస్ వెలుగు, కర్నూలు; భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కర్నూలు నగర కుర్ని (నేసె) సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బిర్లా కాంపౌండ్ లోని డాక్టర్. బ్రహ్మారెడ్డి సమావేశ మందిరంలో కర్నూలు నగర కుర్ని (నేసె) సంక్షేమ సంఘం 2025 క్యాలెండర్ ను ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్ని కులస్తులు వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలని కోరారు. చదువు తోనే అభివృద్ధి సాధ్యమని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. కుర్ని సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2047 విజన్ తో ముందుకు పోతుందని దానిలో భాగంగా విద్యార్థులు చదువుల్లో రాణిస్తే 2047 సంవత్సరం లోపు భారత దేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో నక్కలమిట్ట శ్రీనివాసులు, కృష్ణయ్య, వాసుదేవయ్య, గడిగె ప్రసాద్, రామకృష్ణ, మాదవిలత,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.