కష్టపడిన కార్యకర్తలను,నాయకులు గుర్తించాలి

కష్టపడిన కార్యకర్తలను,నాయకులు గుర్తించాలి

వైసిపి నాయకులను కూటమి పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం శ్రీ సిద్దేశ్వర రైస్ మిల్ నందు కూటమి నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,బిజెపి నాయకులు నరసింహ ప్రసాద్,జనసేన కన్వీనర్ అశోక్,తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ మాట్లాడుతూ మండలంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కష్టపడిన ప్రతి కార్యకర్తలను గుర్తించాలన్నారు.వైసిపి నాయకులతో లాలూచీపడి పార్టీలో చేర్చుకుంటామంటే ఒప్పుకోమని ఎంతటి వారినైనా ఉపేక్షించమన్నారు.అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలను గుర్తించకుండా వైసిపి నాయకుల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం కోసం కృషిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ లో ఉండే వ్యక్తులు ఇక్కడ రాజకీయం చేస్తామంటే కుదరదని,స్థానిక నాయకులు కార్యకర్తలతో చర్చించి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన నాయకులను,కార్యకర్తలను గుర్తించి ఏ పార్టీ కార్యక్రమమైన అందరితో చర్చించి నిర్ణయించాలన్నారు.ఇలాగే కొనసాగితే సహించేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!