చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు మరణశిక్ష

చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు మరణశిక్ష

కర్నూలు , న్యూస్ వెలుగు;  ఇటు పోలీ చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు మరణశిక్ష. చిన్నారులు మహిళలు వృద్ధుల భద్రతకు స్ శాఖ, అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది.ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

ఫోరెన్సిక్ ఆధారాల తో నేర నిరూపణ అయితే చట్ట పరంగా శిక్ష.
చిన్నారులు మహిళలు వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా అధికారి టి శారద తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ ఆర్ పేట సంకల్ బాగ్ లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి టి శారద మాట్లాడుతూ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేరాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా నిఘస్తి బృందాలు ఓవైపు పోలీసు శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుందని, మరోవైపు బాలల సంరక్షణ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సామాజిక నాయకులు చెడుదారులో నడిచే యువతను గమనించాలని, వారిని సమాజాభివృద్ధికి పాటుపడేలా చూడాలని పిలుపునిచ్చారు.
నేర స్వభావాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తో పాటు ముఖ్య పాత్ర వహించాలని కోరారు.

Was this helpful?

Thanks for your feedback!