వైభవంగా నేణికి లింగేశ్వర పట్టా దేవర ఉత్సవం

వైభవంగా నేణికి లింగేశ్వర పట్టా దేవర ఉత్సవం

*భక్త జనంతో కిక్కిరిసిన నేరణికి గ్రామం.
*ఆకట్టుకున్న వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.
*ఉత్సవాల్లో ఒక్కటైన జంటలు.
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని నేరణికి గ్రామంలో ఆదివారం శ్రీ నేణికి లింగేశ్వర పట్టా దేవర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ప్రధానంగా శ్రీ నేణికి లింగేశ్వర స్వామి పట్టా దేవర మహోత్సవంలో భాగంగా 10 గ్రామాల నుంచి విచ్చేసిన ఉత్సవ విగ్రహ మూర్తుల ఊరేగింపు బీరప్ప స్వామి డొళ్ళులతో నేరణికి గ్రామం మారుమోగింది.దేవర కార్యక్రమం సందర్భంగా భక్తులతో గ్రామం కిక్కిరిసింది.అలాగే దేవర ఉత్సవాల సందర్భంగా 50 సామూహిక వివాహాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి దేవరల్లో ఒక్కటైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.అంతేకాకుండా ప్రజలందరీ సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!