మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తి

మహర్షి వాల్మీకి జీవితం సమాజానికి స్ఫూర్తి

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి పెద్దలు,యువకులు కలిసి కట్టుగా ఘనంగా నిర్వహించారు.ముందుగా మహర్షి వాల్మీకి చిత్రపటాని గ్రామంలో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం మహర్షి వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.తదనంతరం ఆలూరు ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షీ,మండల ప్రజలు,వాల్మీకి నాయకులు,అన్ని పార్టీల నాయకులు మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరూపాక్షి మాట్లాడుతూ ఆదికవి మహర్షి వాల్మీకి భారత దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శప్రాయుడని కొనియాడారు.భారతీయ చరిత్రలో సాంస్కృత భాషలో పద్యాల రచన రామాయణంతోనే మొదలైందని ఆ ఘనత ఒక్క ఆదికవి మహర్షి వాల్మీకికే దక్కుతుందన్నారు.సంస్కృతంలో 24 వేల పద్యాలను రాసిన తొలికవి కూడా ఆ మహానియు లేనని తెలిపారు.అంతేకాకుండా తనలోని లోపాలను సరిదిద్దుకొని,పరివర్తన చెందిన గొప్ప సంసృత పండితునిగా, రచయితగా,ఋషిగా మారిన మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు.ప్రతి ఒక్కరూ మహర్షి వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.అంతేకాకుండా వాల్మికులను ఎస్టీ జాబితాలో చేర్చలంటే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల్లో ఉందని.అంతేకాకుండా వల్మికులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు 2017లో నారా చంద్రబాబు నాయుడు,2023లో వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని,మరియు ఎంతో మంది యువకులు వాల్మికుల ఎస్టీ సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు.కావున ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇప్పుడైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళి వాల్మీకుల చిరకాల కోరికను నెరవేర్చాలని కోరారు.ఎస్టీ జాబితాలో చేరిస్తే వాల్మికుల జీవితాలు మారుతాయని,అలాగే నారా చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.అదేవిధంగా వచ్చే యువతరం తనను తలుచుకుంటుందన్నారు.వాల్మీకులు ఆర్థికంగా,సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.వాల్మీకి సోదరులందరూ ఐక్యమత్యంగా ఉండాలని,రామ రాజ్యంలో పరిపాలన ఎలా ఉండాలని సూచించిన మహాన్ వ్యక్తి వాల్మీకి కొనియాడారు.వాల్మీకి జయంతి సందర్భంగా మంటపాని విద్యుత్ దీపాలు,రంగు రంగుల పూలు,పచ్చని తోరణాలతో అలంకరించారు.చుట్టూ పక్కల గ్రామాలైన పెద్దగొనేహల్,ఎండి హళ్ళి,సులువాయి,పెద్దహ్యాట, వందవాగలి,ఎల్లార్తి,గెజ్జెహళ్లి తదితర గ్రామాల్లో కూడా మహర్షి వాల్మీకి జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,వైస్ ఎంపీపీ భర్త హనుమప్ప, రైతు సంఘం నాయకులు కృష్ణయ్య,టిడిపి నాయకులు సీతయ్య,సూరన్న,రామకృష్ణ,గోవింద,పంపాపతి,వెంకటేష్, తిక్కస్వామి,సిద్ధప్ప,చంద్రశేఖర్, సిద్దయ్య,గోవింద,కృష్ణ, శ్రీరంగ ,వార్డు సభ్యులు చిన్న మల్లయ్య, సిద్దలింగ,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!