సాధారణ భూముల పరిరక్షణపై మండల స్థాయి సమావేశం 

సాధారణ భూముల పరిరక్షణపై మండల స్థాయి సమావేశం 

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, APARD ఎన్జీవో ఆధ్వర్యంలో  ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ (FES) మద్దతుతో తుగ్గలి మండలంలో ఒకరోజు మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు  MPDO విశ్వా మోహన్  APO హేమసుందర్ , UVAS సభ్యులు, MGNREGS సిబ్బంది, మండల స్థాయి VRO లు టెక్నీకల్ అసిస్టెంట్లు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి APARD సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్  ఆఫియా  ఆతిథ్యం అందించారు. సాధారణ భూముల పరిరక్షణ, వాటి సంరక్షణ ప్రాముఖ్యత, UVAS సభ్యుల బలోపేతం ప్రధాన అంశాలుగా చర్చించబడినాయి. సాధారణ భూములు పర్యావరణ మార్పులో కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని కాపాడటం ద్వారా పశువుల సంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ, APARD , FES బృందం సాధారణ భూముల పరిరక్షణలో చేసిన పనిని అభినందిస్తున్నాను అని అనడం జరిగింది.

ఎంపీడీవో (MPDO)  సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “సాధారణ భూముల పరిరక్షణ మన వారసత్వం. మన భవిష్యత్ తరాలకు పచ్చని వనరులను అందించేందుకు ఇవి కీలకం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో UVAS సభ్యులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి కార్యకర్తలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సాధారణ భూముల పరిరక్షణ ద్వారా జీవవైవిధ్యాన్ని పెంపొందించుకోవడం, నీటి నిల్వలు మెరుగుపరచుకోవడం, పశువుల కాపరులకు మద్దతుగా నిలవడం వంటి ప్రయోజనాలను వారు చర్చించారు.

ఈ కార్యక్రమం తుగ్గలి మండల రైతులకు, పశువుల కాపరులకు, మరియు గ్రామాల అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని హాజరైన సభ్యులు అభిప్రాయపడ్డారు.

APARD & FES CO D. వన్నూరువలి  పాల్గొనడం జరిగింది

Author

Was this helpful?

Thanks for your feedback!