మండల స్థాయి కబడ్డి టోర్నమెంట్

మండల స్థాయి కబడ్డి టోర్నమెంట్

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని వందవాగలి గ్రామంలో శ్రీ శ్రీ దుర్గమ్మ అవ్వ జాతర మరియు ఉగాది పండుగను పురస్కరించుకుని వందవాగలి భజరంగ్ దళ్ బాయ్స్ టీమ్ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఆసక్తి గల టీమ్ లు 27వ తేది సాయంత్రం 6:00 గంటల లోపు రూ.800/- చెల్లించి తమ టీమ్ పేరును నమోదు చేసుకోవాలని తెలియజేశారు.అలాగే టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి టీమ్ సభ్యులకు భోజనం వసతి కల్పించడం జరుగుతుందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!