
భక్తిశ్రద్ధలతో మండల దీక్ష హోమం
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట ; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లె గ్రామంలో నూతన శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట నిర్వహించిన అనంతరం మండల దీక్ష విరమణలో భాగంగా పూజా కార్యక్రమాలు బుధవారం గ్రామస్తులు మండల పురోహితులు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆస్థాన పురోహితు
లు ఏలేశ్వరం. గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు ఏలేశ్వరం. మధుమూర్తి శర్మ, వీణ. మనోజ్ కుమార్ సహాయ సహకారాలతో శ్రీ కోదండరామ స్వామికి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి మూలవరులకు శ్రీ సూక్త, పురుష సూక్త, విష్ణుసూక్త ప్రకారంగా పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి గ్రామస్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. మండల దీక్ష హోమం భక్తిశ్రద్ధలతో గ్రామస్తుల ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా ఆ గ్రామానికి చెందిన వివిధ ప్రాంతాల బంధుగణం పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇంచార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం ఆ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు పూలదండలతో ఆలయం వద్దకు ఆహ్వానించడం జరిగింది. ఆయన గోత్రనామాలతో శ్రీ కోదండ రామస్వామికి అర్చకులు మధు స్వామి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామస్తులు దీక్ష విరమణ కార్యక్రమానికి ఆహ్వానించబడిన బంధువులకు భోజన వసతి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల. నర్సింహారెడ్డి, కాంట్రాక్టర్ ఎస్. వెంకటరమణ, ఆంజనేయ రెడ్డి ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.