ఇంద్రకీలాద్రి పై 350 పైగా భక్తులచే సామూహిక అమ్మవారి స్తోత్ర పారాయణలు 

ఇంద్రకీలాద్రి పై 350 పైగా భక్తులచే సామూహిక అమ్మవారి స్తోత్ర పారాయణలు 

విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  శనివారం  హైదరాబాద్ కు చెందిన సులోచన ఫౌండేషన్ అను ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకురాలు శైలజా ఆధ్వర్యం లో ఉదయం 10 గం.ల నుండి మహామండపం 6 వ అంతస్తు నందు 350 మంది పైగా సభ్యులతో విశేషముగా శ్రీ అమ్మవారి లలితా సహస్ర నామం, శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం, తదితర అమ్మవారి నామ స్తోత్ర పారాయణము లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నకు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు విశేషముగా విచ్చేసి భక్తి శ్రద్దలతో లలితా సహస్రనామం, ఖడ్గమాల మరియు తదితర అమ్మవారి స్తోత్రములు పారాయణ చేసి, అమ్మవారి, స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!