
వృద్దుడికి అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
పెద్దముడియం, న్యూస్ వెలుగు; పెద్దముడియం మండలం కొండ సుంకేసుల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆశ్రమం నందు నివాసం ఉంటున్న కాస పుల్లారెడ్డి(78) అనే వృద్దుడు అనారోగ్యంతో మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి బంధువులు ఎవరు రాకపోవడంతో మే ఐహెల్ప్యు ఫౌండేషన్ ఛైర్మన్ మోరె లక్ష్మణ్ రావు సంప్రదించగా వెంటనే స్పందించి ఆదివారం మధ్యహ్నం 11:30 లకు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, సి ఇ ఓ మల్లికార్జున ,సుబహన్(ఫౌండేషన్ ప్రెసిడెంట్), అహమ్మద్ హుస్సేన్,ఆన్సర్,నరేంద్ర,వల్లి,వెంకటేష్, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు +91 82972 53484,+91 9550132961,+91 9182244150. ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము.