మక్కా మసీదులో దొంగతనం

మక్కా మసీదులో దొంగతనం

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని భోజనం గ్రామంలో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మక్కా మసీదు కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాను ధ్వంసం కొంత నగదును దొంగలించారు.. మక్కా మసీద్ సంఘం పెద్దలు చెప్పిన వివరాల మేరకు నిన్న రాత్రి మసీదులో ప్రేయర్ అయిన తర్వాత మసీదు తాళాలు వేసి ఇంటికి వెళ్ళామని ఉదయాన్నే వచ్చి చూస్తే కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాను ధ్వంసం చేశారని తెలిపారు. వెంటనే గ్రామ పీకేట్ లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బీరువాలో ఉన్న 2000 వేల రూపాయలు నగదు దొంగిలించారని సంఘం పెద్దలు అన్వర్ భాష కొత్తూరు భాష దూదేకుల రమణ మన్సూర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Author

Was this helpful?

Thanks for your feedback!