
శిథిలావస్థ కల్వర్టుల పునర్నిర్మాణానికి చర్యలు
రహదారులపై మురుగునీరు రాకూడదు
పూడికతీత పనుల్లో
ఆలస్యంగా చేయోద్దు.
నగరపాలక సంస్థ ఎస్.రవీంద్ర బాబు
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో శిథిలావస్థకు చేరిన కల్వర్టుల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బుధవారపేటలోని పలు కాలనీల్లో పర్యటించారు. స్థానికులతో కలియతిరిగి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేపల గుంత మైదానంలో చేపట్టిన గ్రావెల్, నడకబాట వంటి అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజల ఉపయోగార్ధములోకి తీసుకోరావాలని ఆదేశించారు. కాలువల్లో నీరు ప్రవాహానికి తక్కువ సామర్థ్యం ఉన్న కల్వర్టుల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. కొళాయి కనెక్షన్ల కోసం రహదారులపై తీసిన గుంతలపై ప్యాక్ వర్క్ పనులు చేపట్టాలని సూచించారు. పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. క్రమం తప్పకుండా ప్రతీ మురుగు కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ మురుగునీరు రహదారులపైకి రాకూడదని కమిషనర్ పేర్కొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్లోని అన్న క్యాంటీన్ను పరిశీలించి, ఆహర రుచి, పరిసరాల శుభ్రతపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, బిల్డింగ్ ఇంస్పెక్టర్ అంజాద్ బాష, ట్రైనీ ఏఈ రాంమోహన్, శానిటేషన్ ఇంస్పెక్టర్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.