
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. రహదారుల భద్రత కమిటీ నిర్ణయాల అమలుకు సంబంధించి గురువారం బిర్లా కంపౌండ్, గాయత్రీ ఎస్టేట్, సి.క్యాంప్, నంద్యాల చెక్పోస్ట్, వై జంక్షన్, కొండారెడ్డి బురుజు తదితరుల ప్రాంతాల్లో కమిషనర్ రహదారుల భద్రత కమిటీతో పర్యటించారు. రహదారుల భద్రత కమిటీ నగరానికి సంబంధించి 21 నిర్మాణాలు తీసుకున్నదని, వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్&బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మన్సూర్ బాష, ఆరోగ్యధికారి విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, డిఈఈ మనోహర్ రెడ్డి, సూపర్వైజర్ అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!