
బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ: వరదల నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్, బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ద్విచక్రవాహనంపై వీధివీధికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. నిత్యావసర వస్తువుల పంపిణీని పరిశీలించారు. ముంపు బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వస్తువులు, మందుల కిట్లు అందాయో.. లేదో? వాకబు చేశారు. వీధుల్లో శుభ్రతా చర్యలను పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!