కోటి 20లక్షలతో రోడ్డు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

News Velugu Bapatla:   అద్దంకి మండలం, గోవాడ గ్రామంలో రూ.1 కోటి 20 లక్షల MGNREGS నిధులతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడం సంతోషంగా  ఉందని మంత్రి రవికుమార్ తెలిపారు . గత 5 ఏళ్లు NTR  రోడ్డు నుంచి గోవాడ గ్రామానికి రోడ్డు మార్గం బాగోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా గత పాలకులు కనీసం పట్టించుకున్నది లేదన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా బీటీ రోడ్డును అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు రోడ్డు సమస్యను తీర్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రోడ్డు  రవాణా సదుపాయలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS