
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరంలోని గడియారం ఆస్పత్రి సమీపంలో ఉన్న జామియా మసీదులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి మసీదుకు వెళ్లారు. రోజా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింప చేశారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. రంజాన్ నెల ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గడ్డ వీధిలో టిడిపి నాయకులు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!