అస్వస్థకు గురైన బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

అస్వస్థకు గురైన బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

 బాధితులను పరామర్శించిన దేవగుడి యూత్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి.

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని నేతాజీ నగర్ కు చెందిన 25 మంది కలుషిత త్రాగునీరు త్రాగడం వలన అస్వస్థకు గురై ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రిలో చేరడంతో, ఆ సమాచారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తెలియడంతో ఆయన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవడం జరిగిందని కూటమి నాయకులు దేవగుడి యూత్ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను దేవగుడి యూత్ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకుడు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలోని నేతాజీ నగర్ కు చెందిన 25 మంది కలుషిత త్రాగునీరు కలుషితం తాగడం వలన అస్వస్థకు గురయ్యారని డాక్టర్లు తెలిపారని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాధితులను ఫోన్లో పరామర్శించారని తెలిపారు. అలాగే ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సొంత నిధులతో మెరుగైన చికిత్సను అందిస్తున్నారని అన్నారు. ఐసీయూలో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను నాగేశ్వర్ రెడ్డి కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణాపాయస్థితి లేదని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు మున్సిపల్ అధికారులను సైతం త్రాగునీరు ను వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గోనా పురుషోత్తం రెడ్డి, జనసేన కోఆర్డినేటర్ నల్లంశెట్టి నాగార్జున,కౌన్సిలర్ శివారెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్,మిల్ట్రీ శివ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!