
ఓంకారేశ్వరుడిని దర్శించుకున్నఎమ్మెల్యే బుడ్డా దంపతులు
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: మండలంలోని నల్లమల అటవి ప్రాంతంలో వెలిసిన శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామిఅమ్మవార్లను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు సందర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారి నాగ ప్రసాద్ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన చేపించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు శేషవస్త్రాలు తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెన్నారెడ్డి ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU