
శ్రీ మాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
హోళగుంద, న్యూస్ వెలుగు: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం,దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు,గుమ్మనూరు నారాయణస్వామి,గుమ్మనూరు మదన్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గు జయరాం మాట్లాడుతూ బన్నీ ఉత్సవాలను భక్తులందరూ ప్రశాంతంగా జరగాలని మరియు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు.అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బీరప్ప,వీరనాగప్ప,భీమప్ప చౌదరి,జెడ్పిటిసి లింగప్ప,లక్ష్మన్న,బాగోడి రాము,ఎంపీటీసీ మంజునాథ నాయక్,రామయ్య,నేరణికి,నేరణికి తండా సర్పంచ్లు సోమ,రామ్ నాయక్,మాజీ సర్పంచ్ వెంకటేష్,గోవిందు,ముసనపల్లి సర్పంచ్ సోమ,అన్నమయ్య,డీలర్ జయరాముడు,మరి స్వామి,వీరేష్.యంకోబ,రామ్ నాయక్,కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.