
దేవతామూర్తులను దర్శించుకున్న ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామ సమీపంలో నేరేడుజల్ల నందు వెలసిన సుంకులమ్మ దేవి,ఆంజనేయ స్వామి దేవతామూర్తులను మంగళవారం రోజున దర్శించుకుని ప్రత్యేక పూజలను ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో స్వామివారికి పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,బొందిమడుగుల సర్పంచ్ గౌరవ సలహాదారులు ప్రతాప్ యాదవ్, తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!