
పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి ను కలిసిన ఎమ్మెల్యే శ్యామ్ బాబు
ముఖ్యమంత్రిని కలిసిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,తుగ్గలి రంగ.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కొరకు పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు గురువారం రోజున ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటుగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,తుగ్గలి రంగ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని వారు ముఖ్యమంత్రికు తెలియజేశామన్నారు.మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు వలన పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు త్రాగు మరియు సాగునీటికి ఇబ్బందులు ఉండవని వారు తెలియజేశామన్నారు.అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అందజేసినట్లు వారు తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు.