
శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
హోళగుంద,న్యూస్: దసరా బన్ని ఉత్సవాల సందర్భంగా శనివారం మండల పరిధిలోని దేవరగట్టు కొండల్లో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి దర్శించుకున్నారు.అనంతరం స్వామివారి సన్నిధిలో విశేష పూజలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బన్నీ ఉత్సవాలను భక్తులు ప్రశాంతంగా జరగాలని కోరారు.అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు.ఈ విజయ దశమి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శ్రీరాములు, యువనాయకులు లక్ష్మీనారాయణ,చంద్రశేఖర్, వైసిపి,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda