ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్‌లను తరలించండి

ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్‌లను తరలించండి

న్యూస్ వెలుగు కర్నూలు, నగరపాలక సంస్థ; నగరంలో రహదారుల విస్తరణ ప్రాంతాలతో పాటు వివిధ కాలనీల్లో రహదారులపైన అడ్డంగా, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను త్వరితగతిన తరలించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఎస్.ఉమాపతి నిర్ణయించారు. బుధవారం కమిషనర్, ఎస్ఈ, అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆనంద్ థియేటర్ సమీపంలో బంగారుపేట, కిసాన్ ఘాట్ రోడ్డు, మదర్ థెరిస్సా కూడలిలల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్, విద్యుత్ శాఖ ఎస్ఈ తెలిపారు. అలాగే నరసింహా రెడ్డి నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో వెనుక భాగంలో రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!