
గుల్యంలో గాదిలింగప్ప స్వామి జోడు రథోత్సవం వేడుకల్లో ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యం గ్రామంలో జరిగిన గాదిలింగప్ప స్వామి జోడు రథోత్సవం వేడుకల్లో ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..ఎం.పి నాగరాజు టిడిపి శ్రేణులు, గ్రామ ప్రజలు భారీగా స్వాగతం పలికారు.. ముందుగా గాదిలింగప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేసిన ఆయన.. అనంతరం జోడు రథాలకు పూజలు నిర్వహించారు. ఎం.పి మాట్లాడుతూ గాది లింగప్ప స్వామి ఆశీసులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.. ఇక ఈ కూటమి ప్రభుత్వం హయాంలో వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత వాసుల కలను నెరవేరుస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar