
తిరుపతి ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు: తిరుపతి ఘటన పై కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు.. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కోరిన ఎం.పి, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.. మృతి చెందిన ఒకోకరికి రూ 25 లక్షలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిందని ఎం.పి తెలిపారు..
Was this helpful?
Thanks for your feedback!