
బాలసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; మానవ సేవే మాధవ సేవగా భావించిన భగవాన్ శ్రీ బాలసాయి బాబా కులయు మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.
. నగరంలోని పాతబస్టాండ్ తుంగభద్ర నది ఒడ్డున ఉన్న బాలసాయి బాబా మందిరంలో నిర్వహించిన బాలసాయి బాబా జయంతి వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జి వెంకటేష్ కలిసి ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా కుట్టు మిషన్లు, కూరగాయల తోపుడు బండ్లు, వికలాంగుల ట్రై సైకిళ్లను వారు పంపిణీ చేశారు..అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ నిస్వార్థంగా సేవ చేసే వారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.. బాలసాయి బాబా తన ట్రస్ట్ ద్వారా విద్యా సంస్థ లు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించడం తో పాటు, పేద ప్రజల ఉపాది కి సాహయ సహకారాలు అందించారన్నారు.. ఆయన మరణానంతరం కూడా ట్రస్ట్ సభ్యులు బాబా ఆశయాలు, సేవ కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని తెలిపారు.. ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి, బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ రామారావు, బాబా భక్తులు పాల్గొన్నారు..