
కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేని మున్సిపల్ ఇంజనీర్లు
కర్నూలు, న్యూస్ వెలుగు; పంప్ హౌస్ లో జనం వ్యతిరేకించినప్పటికీ నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు వ్యాపార సముదాయాలు నిర్మించారు. షాపుల ఎదుట ప్రహరీ గోడ నిర్మించి దాని పక్కనే ఉన్న మురికి కాలువలో ఫుట్పాత్ పైన టన్నుల కొద్ది మట్టి వదిలేశారు. పంప్ హౌస్లో త్రాగునీటి శుద్ధి కేంద్రాలు శుభ్రం చేసిన సందర్భంలో మరియు వర్షం వచ్చినప్పుడు నీళ్లు అంత వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డు పై నిలిచి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. రోడ్డుపై నీళ్లు ప్రవహించినప్పుడల్లా ద్విచక్ర వాహనదారులు కింద పడడం, మహిళలు వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నరనీ గత ఏడాది నుంచి మున్సిపల్ అధికారుల దృష్టికి తెస్తున్న స్పందించడం. ఏదైనా నిర్మాణం జరిగినప్పుడు బాధలు తవ్విన మట్టి ఊరి బయట వేసి వచ్చినట్లు కాంట్రాక్టర్కు బిల్లులు కూడా ఇచ్చే ఆనవాయితీ ఉన్నది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు తప్ప కాంట్రాక్టర్లు వదిలివేసిన మట్టి ఏడాది గడుస్తున్నా తొలగించండి అని చెప్పేటువంటి స్పృహ కూడా మున్సిపల్ ఇంజనీర్లకు లేకుండా పోయింది. ఫుట్పాత్ పై, మురికి కాలువలో మట్టి కుప్పలు ఫోటోలు తీసుకొని పై కమీషనర్ చూపించినప్పటికీ ఆరు నెలలైనా స్పందించడం లేదు. ఈరోజు సాయంత్రం పంప్ హౌస్ లో త్రాగునీటి శుద్ధి చేసి వదిలిన వృధా నీరంతా రోడ్లపై నిలిచి అనేకమంది కిందపడ్డారు. వెంటనే కమిషనర్ జోక్యం చేసుకొని ఫుట్పాతులపై మురికి కాలువల్లో వేసిన మట్టిని తొలగించని కాంట్రాక్టర్ పై చర్య, నగరపాలక సంస్థ అయినా మట్టిని తొలగించాలని కోరుతున్నాం