నల్లగుండ్ల గ్రామంలో ఉరుసుకు ముస్తాబైన మునిస్వామి దర్గా

నల్లగుండ్ల గ్రామంలో ఉరుసుకు ముస్తాబైన మునిస్వామి దర్గా

* 19న మునిస్వామి ఉరుసు.

* నూతనంగా నిర్మించిన గ్రామ ముఖ ద్వారంను ప్రారంభించనున్న ఎమ్మెల్యే శ్యామ్ బాబు.

* ఉరుసు సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలు నిర్వహణ.

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని నల్లగుండ్ల గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో జనవరి 18 నుండి 20 తేదీ వరకు హజరత్ సయ్యద్ మునీర్ బాషా మునిస్వామి ఉరుసును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో స్థానికంగా ఉన్న మునిస్వామి దర్గాకు కొత్త రంగులు వేయించి ముస్తాబు చేశారు.అదేవిధంగా గ్రామంలోని త్రాగునీటి ట్యాంక్ దగ్గర నూతనంగా నిర్మించిన గ్రామ ముఖద్వారానికి సరికొత్త రంగులు వేయించి ముస్తాబు చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ మునిస్వామి ఉరుసు ముఖ్యఅతిథిగా పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాం బాబు హాజరవుతారని గ్రామ పెద్దలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో గొర్ల గిడ్డయ్య కుమారుడు కుసినేని శేఖర్ నూతనంగా నిర్మించిన
గ్రామ ముఖద్వారమును పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కెయి శ్యామ్ బాబు ముఖ ద్వారాన్ని 19వ తేదిన ప్రారంభిస్తారని వారు తెలియజేశారు.మునిస్వామి మూడవ ఉరుసు సందర్భంగా రాష్ట్రస్థాయి కమిటీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అదేవిధంగా సీతారాముల చెక్కభజన మాస్టర్ ప్యాపిలి మద్దిలేటి ఆధ్వర్యంలో చెక్కభజనను నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు.భక్తుల సౌకర్యార్థం 18 నుండి 20వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు.వచ్చే భక్తుల కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ పెద్దలు గ్రామంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగుండ్ల గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!