
స్వచ్ఛహీ సేవలో మైలవరం మండల విద్యాశాఖ అధికారి
మైలవరం, న్యూస్ వెలుగు; మైలవరం మండలం లోని వేపరాల గ్రామ పంచాయతీ నోడల్ ఆఫీసర్ అయిన మండల విద్యా శాఖాధికారి శ్రీ బత్తిని చిట్టిబాబు ఆధ్వర్యం లో విద్యార్థులు , రెండు సచివాలయాల సిబ్బంది కలిసి మారథాన్ నిర్వహించారు. అలాగే పారిశుధ్య కార్మికులకు ప్రథమ చికిత్స పై హెల్త్ డిపార్టుమెంట్ వారు కల్పించారు. తరువాత మురికినీటి కాలువలు ఉన్నచోట దోమలు వృద్ధి చెందకుండా ఎంఈవో, సెక్రటరీలు బ్లీచింగ్ పౌడర్ చల్లించి, మందు పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో EOPRD రామచంద్రారెడ్డి, రంగనాయకులు, సెక్రెటరీలు ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!