
నారా లోకేష్ 32వ రోజు “ప్రజాదర్బార్”
గుంటూరు, న్యూస్ వెలుగు; రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 32వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!