
నయనశోభితం శ్రీవారి గరుడ సేవ
తిరుపతి ; కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి ప్రీతికరమైన గరుడవాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని తిలకిస్తూ.. చేసిన గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. మూల విరాట్ను అలకరించే అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ్వర సహస్రమాల తదితర ఆభరణాలతో ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వారిని అలకరించి.. సేవను నిర్వహించారు. గరుడ వాహనంపై విహరించే మలయ్యప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం.
Was this helpful?
Thanks for your feedback!