
ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం
హోళగుంద, న్యూస్ వెలుగు: ప్రజల,రైతుల సమస్యలు పరిష్కరించడంలో తహసీల్దార్ కార్యాలయం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.ప్రధానంగా హోళగుంద మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి ప్రజల వివిధ పనుల నిమిత్తం వస్తే అధికారులు మాత్రం పైసలు ఇస్తే మాత్రం పనులు చేస్తామని ముఖం మీద చెప్తున్నారు.అలాగే కొన్ని రోజుల క్రితం గెజ్జెహల్లి గ్రామంలో పిడుగు పాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు కార్యాలయంలో పనుల నిమిత్తం వస్తే అధికారులు మాత్రం పనులు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.విషయాన్ని తాసిల్దార్ దృష్టికి తహశీల్దార్ సతీష మాట్లాడుతూ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని త్వరితగిన బాధితుల పనులు పూర్తి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పంపాపతీ,ఎర్రి స్వామి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda