
దుర్గమ్మను దర్శించుకున్న నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు
విజయవాడ, న్యూస్ వెలుగు; మహిషాసుర మర్దని అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దినిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలోనీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసారు. అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist