
ఎం.పి కార్యాలయంలో ఘనంగా ఎన్.టి.ఆర్ వర్ధంతి వేడుకలు
.ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 29 వ వర్ధంతి వేడుకలను కర్నూలు ఎం.పి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు… ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎం.పి బస్తిపాటి నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సంధర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు ఎన్. టి.రామారావు భారతరత్న ఇవ్వాలని కోరారు. పార్టీ స్థాపించి కేవలం 9 నెలలలోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్. టి.ఆర్ కే దక్కతుందన్నారు.. ఎన్. టి.ఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రూ. 2కి కిలో బియ్యం, గృహ పథకం, ఫించన్లు, ఉచిత కరెంటు, ఆస్తిలో స్త్రీ పురుషులకు సమాన హక్కు లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. నందమూరి తారకరామారావు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్ద పీట వెయ్యడంతోనే బీ.సి సామాజిక వర్గానికి చెందిన తాను నేడు ఎం.పి గా ఉన్నానన్నారు.. ఎన్.టి.ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని ఎం.పి నాగరాజు తెలిపారు…అంతకు ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్.టి.ఆర్ వర్ధంతి వేడుకల్లో ఎం.పి నాగరాజు పాల్గొన్నారు..