
దుర్గామాతకు వెండి నెమలి బహుకరణ
దాతలను అభినందించిన ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామారావు
విజయవాడ, న్యూస్ వెలుగు; భక్తులకు కొంగు బంగారంగా… ఇంద్రకీలాద్రిపై వెలసిన జగజ్జననికి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తితో కానుకలు సమర్పించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తుంటారు. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే దుర్గామాత భక్తుడు వెండితో తయారు చేయబడిన నెమలిని శనివారం జగన్మాతకు బహుకరించారు. ఈ బహుమతిని అందజేసిన దాతలకు ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామారావు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దాతలకు శేష వస్త్రంతో పాటు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist