గోపాలపట్నంలో విరిగిపడ్డ కొండచరియలు అప్రమత్తం చేసిన అధికారులు

గోపాలపట్నం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణనగర్‌ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే గణపతి బాబు ఆదేశాల మేరకు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS