అధికారులు అలసత్వం వీడి వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలి

అధికారులు అలసత్వం వీడి వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలి

  గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పించండి

విద్యార్ధులు వలసలు వెళ్లకుండా ఆపండి

అవసరమైన చోట సీజనల్ హాస్టళ్లను వెంటనే ఏర్పాటు చేయాలి

టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; అధికారులు అలసత్వం వీడి వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎంపిడిఓ,ఉపాధి హామీ ఏపిడీలు, ఏపిఓ లను
మంగళవారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలుపై,వలసల నివారణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల ఎంపిడిఓ లు, ఏపిడీలు, ఏపిఓ లతో లోతుగా సమీక్షించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో వలసలు వెళుతున్నారని పత్రికల్లో తరచుగా కథనాలు వస్తున్నాయి..గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించడం కానీ, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ లకు వెళ్లి వలసలు వెళ్లే వారితో మాట్లాడి ఆపడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు కన్పించడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు..ఈ అంశంలో అధికారుల్లో స్పందన లేదని, మేల్కొనాలని, వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. గ్రామాలకు వెళ్లి క్యాంపులు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.. పిల్లల చదువులు భంగం కాకుండా తల్లిదండ్రులను ఒప్పించాలన్నారు.. అవసరమైన చోట సీజనల్ హాస్టళ్లను ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. వలసలు నివారించేందుకు గాను వలసలు వెళ్తున్న గ్రామాలకు ఏపిఓ లు, ఎంపిడిఓ లు టీమ్ లుగా వెళ్లి కూలీలతో మాట్లాడి ఉపాధి హామీ పనుల కల్పన, వేతనం గురించి, పిల్లల చదువులకు భంగం కలుగుతుందని వివరించే విధంగా పూర్తి స్థాయికి అవగాహన కల్పించాలన్నారు.. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను తనకు సమర్పించాలని కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు.
గత ఏడాదిలో ఇదే సమయానికి 88 వేల మందికి ఉపాధి పనులు కల్పిస్తే ఈ ఏడాది ఇదే సమయానికి కేవలం 53 వేల మందికే పనులు కల్పించారన్నారు..అధికారులు అలసత్వం తో ఉన్నారని, ఇలాగే ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. రేపటి నుంచి గ్రామాలకు వెళ్లాలని,ప్రతి కూలీ తో మాట్లాడి, వలసలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. రెండు వారాల్లో పూర్తి స్థాయిలో పనులు కల్పించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.. ఉపాధి హామీ ఎపిడి లు సక్రమంగా పనిచేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. డివిజన్ ల వారిగా ఈ రెండు నెలలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను రేపు సాయంత్రం లోపు సమర్పించాలని కలెక్టర్ ఏపీడీలను ఆదేశించారు..
గత కొన్ని వారాల నుండి చెబుతున్నప్పటికీ కూడా కూలీలకు పనులు కల్పించడంలో ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నారని, పనులు ఉన్నప్పటికీ, ఎందుకు పనులు కల్పించడం లేదని కలెక్టర్ ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, కల్లూరు, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడబూరు, హోలగుంద, పత్తికొండ, వెల్దుర్తి, ఆస్పరి, సి.బెలగల్ మండలాలు ఎంపిడిఓ, ఏపీఓ లను ప్రశ్నించారు.. జనవరి 31 వ తేది నాటికి కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో తప్పుకుండా పురోగతి సాధించాలని, లేదంటే సంబంధిత ఎంపిడిఓ, ఏపీఓ, ఏపీడి ల మీద చర్యలు తప్పవన్నారు.. అదే విధంగా ఫిబ్రవరి 15వ తేది నాటికి కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో 100 శాతం పురోగతి సాధించాలన్నారు.. ఈ రెండు నెలల్లో కూలీలకు వంద శాతం ఉపాధి పనులు కల్పించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.. వలసలు వెళుతున్న గ్రామాల వద్దకు వెళ్లి అక్కడున్న కూలీలతో మాట్లాడి ఉపాధి పనులు కల్పిస్తాం, వలసలు వెళ్లొద్దండి అని అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వలసలు వెళుతున్న గ్రామాలలో సీజనల్ వసతి గృహాలు లేనిచోట ప్రతిపాదనలు పంపాలని, వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు వలసలు వెళ్లకుండా ఎంఈవో లు కూడా బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..ఆదోని, తుగ్గలి, కోసిగి మండలాలు కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో 75 శాతం పురోగతి సాధించాయని,అయినప్పటికీ ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..డివిజన్ ల వారీగా ఎక్కడ పనులు జరుగుతున్నాయి?ఎక్కడ పనులు జరగడం లేదు? రానున్న రెండు నెలలకు సంబంధించి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు?ఎన్ని గ్రామాలను సందర్శించారు? అని కలెక్టర్ ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ఏపీడీలను ఆరా తీశారు??? మండలాల వారీగా సమీక్షలు నిర్వహించుకుని కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో ఇంకా చాలా పురోగతి తీసుకొని రావాలన్నారు.. వలసలు నివారించే విధంగా గ్రామాలను సందర్శించి కూలీలకు అవగాహన కల్పించాలన్నారు.. ఎవరైనా వలసలు వెళ్లి ఉంటే వారి పిల్లలను సీజనల్ వసతి గృహాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. అదే విధంగా డివిజన్ ల వారీగా ఏపీడీ లు తీసుకున్న చర్యలను తనకి సమర్పించాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు..
గోకులంల నిర్మాణాలు ఇప్పటివరకు 471 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదోని మండలం గోకులం నిర్మాణాల్లో వెనుకబడి ఉందని, త్వరతగతిన పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ ఎంపిడిఓ ను ఆదేశించారు..టెలికాన్ఫరెన్స్ లో డ్వామా పిడి వెంకటరమణయ్య, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!