ఓంకారం ఆలయ అర్చకుడు మృతి

ఓంకారం ఆలయ అర్చకుడు మృతి

బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్ : మండల పరిధిలో ఉన్న ఓంకార పుణ్యక్షేత్రంలోని ప్రధాన అర్చకుడు గా పనిచేస్తున్న సుధాకర్(58) గురువారం ఆకస్మికంగా మృతి చెందారు .గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన ఆలయ అర్చకుడు సుధాకర్ కర్నూల్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతి చెందిన అర్చకుడు సుధాకర్ జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. సుధాకర్ ఆకస్మిక మృతి పట్ల ఓంకార క్షేత్ర కార్యనిర్వాహణాధికారి నాగప్రసాద్ తో పాటు ఆలయ అర్చకులు,పలువురు గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!