ప్రభుత్వ ఇంజనీర్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన చేనేత సొసైటీ యాజమాన్యం

ప్రభుత్వ ఇంజనీర్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన చేనేత సొసైటీ యాజమాన్యం

ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సాగర్

మైలవరం, న్యూస్ వెలుగు; కడప జిల్లాలో మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో గల శివాలయం నగర్ డబ్ల్యూ సి ఎస్ 37 చేనేత సహకార సంఘం చేస్తున్న అక్రమాల( ఫోర్జరీ ) మీద మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సాగర్ ఆధారాలతో సహా మైలవరం ఇరిగేషన్ ఆఫీస్ నందు శివాలయం నగర్ చేనేత సొసైటీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సాగర్ మాట్లాడుతూ దొమ్మర నంద్యాల గ్రామంలో గల శివాలయం నగర్ డబ్ల్యూ సి ఎస్ 37 చేనేత సహకార సొసైటీ వర్క్ షెడ్ నిర్మాణం చేసుకోవడానికి 2017 – 18 సంవత్సర మధ్యకాలంలో కడప జోలి శాఖ వారి నుండి అనుమతి తీసుకుంది. నిర్మాణం కొరకు దొమ్మర నంద్యాల గ్రామంలో సర్వేనెంబర్ 240/3 నందు స్థలం తీసుకొని సొసైటీ పేరు మీద రిజిస్టర్ చేయించారు.
నిర్మాణంలో భాగంగా దొమ్మర నంద్యాల పంచాయతీ కార్యదర్శి  మైలవరం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి వర్క్ షెడ్ నిర్మాణం చేయకుండా చేసినట్టు సృష్టించి గవర్నమెంట్ ద్వారా వచ్చే సబ్సిడీ డబ్బులను శివాలయం నగర్ చేనేత సొసైటీ యాజమాన్యం దోచేసిందని తెలిపారు, అక్రమాలు చేస్తున్నా ఈ చేనేత సహకార సంఘం యాజమాన్యం అనగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, చైర్మన్ ,మేనేజర్ ,కార్యదర్శి, సహాయ కార్యదర్శి,కోశాధికారి, కమిటీ సభ్యుడు మరియు లిక్విడేటర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి దీనికి సహకరించిన అప్పటి కడప జౌళి శాఖ అధికారులను సస్పెండ్ చేయించాలని మైలవరం ఇరిగేషన్ ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ భాష గారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!