స్టేడియంలో పారా స్పోర్ట్స్

స్టేడియంలో పారా స్పోర్ట్స్

కర్నూలు, న్యూస్ వెలుగు; విభిన్న ప్రతిభావంతులకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహించారు. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో ఈపోటీలను ఏపీఎస్పీ బెటాలియన్ డిఎస్పీ మహాబూబ్ బాష ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతుల్లో దాగివున్న ప్రతిభను బయటకు తీసేందుకు ఈక్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. జిల్లాలో ప్రతిభకనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపుతోపాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని డిఎస్పీ మహాబూబ్ బాష తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!