
రబీ పంటలకు భీమా చెల్లించండి
హోళగుంద,న్యూస్ వెలుగు: రైతులు రబీ సీజన్లో వేసిన పంటలకు పంట భీమా చేసుకోవాలని శనివారం మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రబీ పంటలైన జొన్న,వరి,వేరుశెనగ,టమోట పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన,వాతావరణ భీమా చేసుకోవాలన్నారు.ఎకరానికి జొన్నకు రూ.297/- రూపాయలు,టమాటకు రూ.1500/- రూపాయలు,వేరుశనగ రూ.480/-రూపాయలు,పప్పుశనగకు రూ.420/- రూపాయలు,ఉల్లికి రూ.1350/- రూపాయలు,వరికి రూ.630/- రూపాయలు భీమా చెల్లించాలన్నారు.మరియు రబీ భీమాను డిసెంబర్ నెల 15వ తేది లోపు చేసుకోవాలని సూచించారు.పంట భీమా చేసుకునేందుకు రైతులు తమ పొలం పాస్ బుక్,బ్యాంక్ పాస్ బుక్,ఆధార్ కార్డు తీసుకోని సిఎస్సి కేంద్రాలకు వెళ్లి భీమా చేయించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ వీరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!