పారిశుధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ వహించండి

పారిశుధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ వహించండి

         ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ బి
హోళగుంద, న్యూస్ వెలుగు: పారిశుధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ బి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ కు సూచించారు.శనివారం మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ నందు రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం ఆమె వారపు సంత మార్కెట్ నందు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వ్యాపారస్తులకు అడిగి తెలుసుకున్నారు.మరియు శ్రీ సిద్ధేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా తేరు బజార్,ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.అలాగే గ్రామంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లైన్ నందు త్రాగునీటి సమస్య ఉందని గ్రామస్థులు తెలిపారు.స్పందించిన సర్పంచ్ తనయుడు పంపాపతి గ్రామంలో ఒకే నీటి ట్యాంక్ ఉండడంతో అప్పుడప్పుడు నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తాయని ముందు ముందు నీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదేవిధంగా గ్రామంలో 947 అక్రమ కొళాయిలు ఉన్నాయని వీటికి డిపాజిట్ లు వసూలు చేసి అదనపు నీటి ట్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.దిడ్డీ కాలనీ, కోర్చి వంక,ఈట్ల కట్ట పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల ఎప్పటికప్పుడు నిఘా వహించాలని ప్రజలు కోరగా స్పందించిన డీఎల్పిఓ నూర్జహాన్ సంబంధిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పై ప్రత్యేక నిఘా కార్యదర్శి రాజశేఖర్ కు సూచించారు.తదనంతరం ఎల్లార్తి శ్రీ హజరత్ షేక్షవలి షాషావలి దర్గాను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి చక్రవర్తి,పంచాయితీ కార్యదర్శులు రాజశేఖర్,షఫీ,సర్పంచ్ తనయుడు పంపాపతి, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!